Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశ వ్యాప్తంగా 1100 రైళ్లు రద్దు.. ఎందుకో తెలుసా?

Advertiesment
goods train
, గురువారం, 5 మే 2022 (11:28 IST)
దేశ వ్యాప్తంగా దాదాపు 1100 రైళ్లను భారతీయ రైల్వే శాఖ రద్దుచేసింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం క్రమక్రమంగా పెరుగుతుంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా, నేలబొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. దీనికితోడు వేసవి ఎండల తీవ్రత నానాటికీ పెరిగిపోతోంది. దీంతో కరెంట్ డిమాండ్ నానాటికీ పెరిగిపోతోంది. బొగ్గు ఉత్పత్తిలో కొరత ఏర్పడంతో విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా సాగడం లేదు. దీంతో ఇండియన్ రైల్వే ఈ సంక్షోభంపై దృష్టిసారించింది. 
 
విద్యుత్ కేంద్రాలకు త్వరితగతిన బొగ్గును తరలించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం గూడ్సు రైళ్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, భారీగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 1100 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. 
 
ఇప్పటికే అనేక రైళ్లు ఉన్నాయి. వీటిలో 500 ట్రిప్పుల ఎక్స్‌ప్రెస్ మెయిల్ రైళ్లు, 580 ట్రిప్పుల ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఏప్రిల్ 29వ తేదీన బొగ్గు రైళ్ళను నడిపేందుకు వీలుగా ఏకంగా 240 ప్యాసింజర్ ట్రైన్స్‌ను రైల్వే శాఖ రద్దుచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ వర్షాలతో యాదాద్రి క్షేత్రం అతలాకుతలం.. రోడ్డు కుంగిపోయింది..