Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేపర్స్ లీక్ - టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు రద్దు

Exams
, శనివారం, 24 డిశెంబరు 2022 (18:58 IST)
ఉదయ్‌పూర్‌లోని టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు రద్దయ్యాయి. టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ కావడంతో ఈ పరీక్షలు రద్దు అయ్యాయి. టీచర్స్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ 2022 కోసం రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల షెడ్యూల్ జారీ చేసింది. 
 
ఈ క్రమంలో శనివారం జరగాల్సిన జీకే పరీక్ష పేపర్ లీకైంది. ఈ పరీక్షలు రాసేందుకు జలోర్ నుంచి 50మంది అభ్యర్థులు బస్సులో శుక్రవారం అర్థరాత్రి బస్సులో ప్రయాణించారు. 
 
ఈ సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్తి చేసిన జవాబు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మేరకు గ్యాంగ్ లీడర్, అతని అనుచరులతో పాటు అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో లాక్‌డౌన్ తప్పదా.. ? నిపుణులు ఏమంటున్నారు..?