Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టీల్ ప్లాంట్‌తో జిల్లా రూపు రేఖలు మారిపోతాయ్ : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (14:02 IST)
కడప జిల్లా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ జిల్లా ప్రజల చిరాకల స్వప్నం నెరవేర్చేందుకు ఈ రోజు శ్రీకారం చుట్టామన్నారు. జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ చేసినట్టు చెప్పారు. 
 
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని, యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించాలని తన తండ్రి దివంగత వైఎస్ఆర్ కలలుకన్నారన్నారు. ఆయన మరణాంతరం ఈ ప్రాంతాన్ని ఏ ఒక్క పాలకుడూ పట్టించుకోలేదన్నారు. ఇపుడు వైఎస్ఆర్ బిడ్డగా మీ బిడ్డ అయిన తాను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంతానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయన్నారు. 
 
వైఎస్ఆర్ కలలను సాకారం చేయడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదురునిలిచి, ఇపుడు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామన్నారు. వచ్చే 24 లేదా 30 నెలల్లో ఈ ప్లాంట్ తొలి నిర్మాణం పూర్తవుతుందన్నారు. ప్లాంట్ మొదలైన అనుబంధ పరిశ్రమలు జిల్లాకు తరలివస్తాయని, జిల్లా అభివృద్దిలో ఇకపై దూసుకుని పోతుందన్నారు. ప్రారంభంలో ఈ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం 3 మిలియన్ టన్నులుగా ఉందని, భవిష్యత్‌లో ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 13 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని సీఎం జగన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments