Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్ వివేకా హత్య కేసు : సీబీఐ అధికారుల ఎదుట ఏపీ సీఎంవో ఓఎస్డీ

viveka deadbody
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (14:36 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఇపుడు వేగవంతమైంది. ఇటీవల వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వద్ద సీబీఐ విచారణ జరిపింది. ఈ విచారణ తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణి వైఎస్ భారతీ పీఏ నవీన్‌‍లకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 
 
ఈ క్రమంలో కృష్ణమోహన్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో సీబీఐ అధికారుల శుక్రవారం ఎదుట హాజరయ్యారు. ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీబీఐ నోటీసుల నేపత్యంలో నవీన్ కూడా కడపకు చేరుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి విచారణ ముగిసిన తర్వాత నవీన్‌ను కూడా విచారించే అవకాశం ఉంది. 
 
కాగా, వివేహా హత్య తర్వాత అవినాశ్ రెడ్డి ఫోన్ నుంచి నవీన్, కృష్ణమోహన్ రెడ్డిలకు అత్యధిక సంఖ్యలో కాల్స్ వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. కృష్ణమోహన్ రెడ్డికి వైఎస్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉంది. వైఎస్ హయాంలో ఆయన. పులివెందుల ఓఎస్డీగా వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎంవోలో కీలక స్థానంలోకి వచ్చారు సీఎం జగన్‌కు వచ్చే కాల్స్ మొదట కృష్ణమోహన్ రెడ్డిని స్వీకరిస్తారని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎప్సీడీఎస్సీలో 1601 పోస్టుల భర్తీకి సన్నాహాలు