Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళింట విషాదం.. కొన్ని క్షణాల్లో తల్లీ కుమారుడు మృతి!!

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (09:40 IST)
అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. కొన్ని నిమిషాల వ్యవధిలో తల్లీ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ ఇంట విషాదం చుట్టుముట్టింది. పెళ్లి తంతు పూర్తయిన కాసేపటికే వరుడి నాయనమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన మృతురాలి కుమారుడు కుప్పకూలి మరణించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి (56) పామిడి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్నారు. ఈయన కుమారుడు గోవర్థన్ వివాహం శనివారం ఘనంగా నిర్వహించారు. 
 
అయితే, అప్పటికే అనారోగ్యంతో బాధపడుతూ మంచానఉన్న వెంకటస్వామి తల్లి కోన్నమ్మ (70)ను మూడు రోజుల క్రితం అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, అప్పటికే పెళ్లి సమయం దగ్గరపడడం, వాయిదా వేసుకునే అవకాశం లేకపోవడంతో బాధగానే వెంకటస్వామి తన కుమారుడి పెళ్లి జరిపించారు. 
 
ఈ క్రమంలో వివాహం ముగిసిన కాసేపటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి మరణించిందన్న వార్త వెంకటస్వామికి తెలిసింది. అది విన్నవెంటనే ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తల్లి, కుమారుడు మరణించడంతో పెళ్లింట విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments