Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి.. సురక్షితంగా ఉన్నానటు కమిది వెల్లడి

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (09:20 IST)
ఇరాక్ దేశ ప్రధానమంత్రి ముస్తాఫా అల్-కదిమి నివాసంపై ఆదివారం తెల్లవారుజామున డ్రోన్ల సాయంతో బాంబు దాడి జరిగింది. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ డ్రోన్‌తో బాగ్దాద్‌లోని ఆయన నివాసంపై దాడి జరిగినట్టు భద్రతా దళాలు వెల్లడించాయి. 
 
అయితే, ఈ డ్రోన్ దాడి నుంచి ప్రధాని అల్ కమిది సురక్షితంగా బయటపడ్డారు. కానీ, ఆయన రక్షణ సిబ్బంది పలువురు గాయపడ్డారు. గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో హింస చోటుచేసుకున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో తాజా దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి ఘటనకు ఇప్పటివరకు ఎవరూ నైతిక బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. డ్రోన్ దాడి జరిగిన ప్రాంతం గ్రీన్ జోన్ కావడం గమనార్హం. 
 
పైగా, ఇక్కడ అనేక ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ప్రధాని నివాసంపై దాడి ‘ఆరోగ్యకరం’ కాదని  ఇరాక్ మిలటరీ పేర్కొంది. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. ప్రధాని సురక్షితంగా ఉన్నారని, అందరూ సంయమనం పాటించాలని ప్రధాని ట్విట్టర్ ఖాతా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments