Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఈసీగా లేరు... టీడీపీ కార్యకర్తగా ఉన్నారు : మంత్రి బొత్స

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (12:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు విషంగక్కారు. ఆయన ఎస్ఈసీగా లేరని, టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
 
ఇదే అంశంపై ఆయన నెల్లూరులో మాట్లాడుతూ, రాజ్యాంగ వ్యవస్థను నడిపే వ్యక్తిలా కాకుండా రాజకీయ నేతగా, పార్టీ నాయకుడిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ వ్యవహరిస్తూ రాజ్యాంగ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని ఆరోపించారు. 
 
ఎన్నికల కమిషనర్‌కి అధికారం, బాధ్యత ఉంటాయని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ విషయం కూడా నిమ్మగడ్డకు తెలిసినట్టు లేదన్నారు. 
 
పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి కూడా ఎన్నికల కమిషనరేనన్న విషయాన్ని మరచి మాట్లాడటం సమంజసం కాదన్నారు. కేవలం విలేకరుల సమావేశంలో మాట్లాడేందుకు నిమ్మగడ్డ అద్దాన్ని అడ్డంపెట్టి ఎన్నో జాగ్రత్తలు పాటించారని, అంటే ఆయనొక్కక్కడికేనా ప్రాణం, ప్రజలు, అధికారులు, ఉద్యోగులవి ప్రాణాలు కావా? అని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments