Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత కన్నాకు షాకిచ్చిన వైకాపా సర్కారు

Webdunia
సోమవారం, 24 జులై 2023 (14:09 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు వైకాపా ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. ఆయనకు ప్రభుత్వం కల్పిస్తూ వచ్చిన సెక్యూరిటీని తొలగించింది. కన్నా లక్ష్మీనారాయణ గన్‌మెన్లను ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని టీడీపీ ఆరోపిస్తోంది. భద్రత తొలగింపు విషయంలో ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 
 
గన్‌మెన్లను తొలగించడం సరికాదని టీడీపీ అంటుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఒత్తిడితోనే గన్‌మెన్లను ఉపసంహరించుకుందని ఆరోపిస్తుంది. ఇకపోతే కన్నా లక్ష్మీనారాయణ గన్‌మెన్లుగా ఉన్న పోలీసులు గత మూడు రోజులుగా విధులకు రావడం లేదు. దీంతో అనుమానం వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ ఆరాతీయగా భద్రత ఉపసంహరించుకున్నట్లు తెలిసిందని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి కన్నా లక్ష్మీనారాయణ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments