Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొడ్డిదారిలో కాదు.. రాజమార్గంలో తీసుకొస్తున్నా : పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (14:39 IST)
తన అన్న నాగబాబును క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. అదీ కూడా దొడ్డిదారిన కాకుండా రాజమార్గంలో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నానని తెలిపారు.
 
ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు బుధవారం జనసేన పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, తనలో రాజకీయ చైతన్యం నాగబాబు వల్లే మొదలైందని, ఒక విధంగా చెప్పాలంటే నాగబాబే తనకు రాజకీయ గురువు అని చెప్పారు. అదేసమయంలో రాజకీయ పరిస్థితుల్లో తన సోదరుడు నాగబాబును దొడ్డిదారినకాకుండా నేరుగా ప్రజా క్షేత్రంలో నిలబెడుతున్నానని వ్యాఖ్యానించారు. 
 
నాగబాబును రాజమార్గంలో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నానని చెప్పారు. నాగబాబు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయనకు రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అందుకే నరసాపురం లోక్ సభ స్థానం నుంచి జనసేన తరపున నాగబాబును పోటీకి దించుతున్నట్టు తెలిపారు. 
 
ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న నాగబాబు... తన పిలుపు మేరకు అన్నింటిని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నామన్నారు. ఈ సందర్భంగా జనసేనలో చేరిన నాగబాబుకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments