Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చెన్నను అరెస్టు చేసిన విధానం తప్పు : వైకాపా ఎంపీ

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (20:51 IST)
ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన విధానం సరిగా లేదని వైకాపాకు చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ముఖ్యంగా, గోడ దూకి అచ్చెన్నను అరెస్ట్‌ చేయాల్సిన అవసరంలేదన్నారు. 
 
అచ్చెన్నాయుడు అరెస్టుపై ఆయన స్పందిస్తూ, అచ్చెన్నాయుడే కాదు.. ఏ రాజకీయ నాయకుడైనా నిజంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. సీఎంకు తప్ప ఎవరికీ ఏసీబీ ముందుగా తెలియజేయదన్నారు. టీడీపీ నేతలు రోజుకు ఒకరు అరెస్ట్‌ అవుతారని, మంత్రులు అనడం సరికాదన్నారు. 
 
'మంత్రుల వ్యాఖ్యలతో కావాలని చేసినట్లు ఉందని అనుకుంటారు. వైసీపీ నేతల అత్యుత్సాహం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు. ఆధారం లేకుండా ఎవరూ కేసులు పెట్టలేరు. కక్ష సాధింపునకే కేసులు పెడుతున్నారనడం సరికాదు. అరెస్టు చేసిన విధానం సరిగా లేదు. 
 
అలాగే, అచ్చెన్నను పరామర్శించడానికి చంద్రబాబును అనుమతించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే. పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు జగన్‌ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రతిపక్షానికి నచ్చక పోవడం వల్లే కోర్టులను ఆశ్రయించారని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం
Show comments