Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మాజీ ప్రధాని గిలానీకి కరోనా పాజిటివ్

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (20:28 IST)
పాకిస్థాన్ దేశంలో కూడా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆ దేశ రాజకీయ నాయకులకు కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలకు ఈ వైరస్ సోకింది. ఇపుడు ఆ దేశ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కూడా కరోనా బారినపడ్డారు. గిలానీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన కుమారుడు కాసిమ్ గిలానీ వెల్లడించారు. 
 
అయితే, తన తండ్రికి కరోనా వైరస్ సోకడంపై కాసిమ్ గిలానీ స్పందిస్తూ ఆ దేశంలోని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. 'ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోకి కృతజ్ఞతలు. మా నాన్న జీవితాన్ని మీరు విజయవంతంగా ప్రమాదంలోకి నెట్టగలిగారు. ఆయన కరోనా పరీక్ష పాజిటివ్ అని వచ్చింది' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
 
కాగా, ఇటీవల పీటీఐ, పీఎంఎల్ ఎన్ పార్టీల నేతల్లో చాలామంది కరోనా బారినపడిన విషయం తెల్సిందే. ప్రధాన విపక్ష నేత, పీఎంఎల్ ఎన్ పార్టీ అధినేత షహబాజ్ షరీఫ్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మాజీ ప్రధాని షాహిద్ ఖఖాన్ అబ్బాసీ, రైల్వే మంత్రి షేక్ రషీద్ సైతం కరోనా బాధితుల జాబితాలో చేరారు. 
 
పాకిస్థాన్‌లో మొట్టమొదటి కేసు ఫిబ్రవరి 26న వెలుగు చూడగా, అప్పటి నుంచి ఇప్పటివరకు 1,32,405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,551 మంది మృత్యువాత పడగా, 50 వేల మందికి పైగా కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments