Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ గ్యాస్ లీక్ : విగత జీవులుగా పడిపోయిన మూగజీవులు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (13:26 IST)
విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టిరిన్ అనే విషవాయువు లీకైంది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా అస్వస్థతకు లోనయ్యారు. అలాగే, అనేక మూగ జీవులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా విష వాయువు పీల్చిన బర్రెలు, గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు, దున్నలతో పాటు.. పక్షులు, పిట్టలు, శునకాలు కూడా మృత్యువాతపడ్డాయి. 
 
ఈ మూగ జీవులు విషవాయువును పీల్చగానే నోటి వెంట నురగ వచ్చి చనిపోయాయి. చివరకు పచ్చని చెట్లు కూడా మాడిపోయాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్ ఉన్న పరిసర ప్రాంతాలతో పాటు.. విష వాయువు వ్యాపించిన మూడు కిలోమీటర్ల పరిధిలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. 
 
కాగా, ఈ గ్యాస్ లీకేజీ వల్ల ప్రాణలు కోల్పోయిన మృతుల కుటుంబాలతో పాటు... బాధితుల కుటుంబాలను ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం పరామర్శించి, ప్రభుత్వం తరపున ఆర్థికసాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇవ్వనున్నారు. అలాగే, చనిపోయిన పశువులకు కూడా రూ.25 వేలు, 15 వేల కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments