Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ గ్యాస్ లీక్ : విగత జీవులుగా పడిపోయిన మూగజీవులు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (13:26 IST)
విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టిరిన్ అనే విషవాయువు లీకైంది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా అస్వస్థతకు లోనయ్యారు. అలాగే, అనేక మూగ జీవులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా విష వాయువు పీల్చిన బర్రెలు, గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు, దున్నలతో పాటు.. పక్షులు, పిట్టలు, శునకాలు కూడా మృత్యువాతపడ్డాయి. 
 
ఈ మూగ జీవులు విషవాయువును పీల్చగానే నోటి వెంట నురగ వచ్చి చనిపోయాయి. చివరకు పచ్చని చెట్లు కూడా మాడిపోయాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్ ఉన్న పరిసర ప్రాంతాలతో పాటు.. విష వాయువు వ్యాపించిన మూడు కిలోమీటర్ల పరిధిలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. 
 
కాగా, ఈ గ్యాస్ లీకేజీ వల్ల ప్రాణలు కోల్పోయిన మృతుల కుటుంబాలతో పాటు... బాధితుల కుటుంబాలను ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం పరామర్శించి, ప్రభుత్వం తరపున ఆర్థికసాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇవ్వనున్నారు. అలాగే, చనిపోయిన పశువులకు కూడా రూ.25 వేలు, 15 వేల కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments