Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా దూకుడు : మరో 54 పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (12:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా మరో 54 కేసులు నమోదయ్యాయి. మొత్తం 7,320 శాంపిళ్లను పరిశీలించగా, అందులో 54 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 16, చిత్తూరులో 3, గుంటూరులో 1, కృష్ణాలో 6, కర్నూలులో 7, విశాఖపట్నంలో 11, విజయ నగరంలో 1 కేసు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరిలో 9 కేసులు నమోదయ్యాయి.
 
ఇకపోతే, రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,887గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 842 మంది డిశ్చార్జ్ కాగా, 41 మంది మరణించారని వివరించింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,004గా ఉందని పేర్కొంది. 
 
మరోవైపు, రాష్ట్రంలోని జిల్లాల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురంలో 99, చిత్తూరులో 85, ఈస్ట్ గోదావరిలో 20, గుంటూరులో 374, కడపలో 96, కృష్ణలో 322, కర్నూలులో 547, నెల్లూరులో 96, ప్రకాశంలో 61, శ్రీకాకుళంలో 5, విశాఖపట్టణంలో 57, విజయనగరంలో 4, వెస్ట్ గోదావరిలో 68, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 27 మంది వలస కూలీల కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments