Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం శిరస్సు ధ్వంసం, అపహరణ

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (21:44 IST)
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అయోధ్యగా ప్రసిద్ధి చెందిన విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై రామచంద్రమూర్తి విగ్రహాన్ని కొందరు గర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం చెయ్యటం పట్ల హిందూ ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. ఈ ఉదయం విగ్రహం విధ్వంసం జరిగిన తీరుని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శివానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీరాముడి విగ్రహం శిరస్సుని ఖండించి తీసుకెళ్లిన క్రూరులపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గడచిన రెండేళ్లలో రాష్ట్రంలో 20 హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినప్పటికీ ఇంతవరకు ఒక్కరిపై కూడా చర్యలు లేవన్నారు. సెక్యూలర్ దేశంలో ఇలాంటి అరాచకాలకు పాల్పడిన రాక్షసులను వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా స్వామి శివానంద డిమాండ్ చేశారు.
 
కాగా ఇందుకు నిరసనగా విజయనగరం బీజేపీ అధ్యక్షులు రెడ్డి పావని ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలని రామతీర్ధాలు కొండపై చేస్తున్న దీక్ష చలిలో కూడా చేస్తున్నట్లు సమాచారం.
ఇలావుండగా శ్రీరాముని విగ్రహాన్ని కొందరు దుండగులు.విధ్వంసం చేసినందుకు నిరసనగా బుధవారం ఉదయం రామతీర్థం ఆలయం వద్దకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉదయం ఆ పార్టీ కార్యాలయం నుండి 9గంటలకు మౌనప్రదర్శన బయలుదేరి ఆలయం వద్ద కొనసాగించనున్నట్లు విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి అదితి గజపతిరాజు ఒకప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments