Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్‌ను స్టేషన్‌కు పిలిచి లాఠీలు విరిగేలా కొట్టిన ఎస్సైలు

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (10:53 IST)
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ముగ్గురు ఎస్సైలు కలిసి ఓ కానిస్టేబుల్‌ను చితకబాదారు. అదీ కూడా తమ చేతిలోని లాఠీలు విరిగిపోయేరా కొట్టారు. తాను కూడా పోలీస్ కానిస్టేబుల్ ముర్రో అని మొత్తుకుంటున్నా ఎస్సైలు ఏమాత్రం పట్టించుకోకుండా చావబాదారు. ఇది ఇపుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాళహస్తి రూరల్ పోలీసుస్టేషన్‌‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌ సోమవారం అర్థరాత్రి సమయంలో తన స్నేహితులతో కలసి ఓ దాబాలో కూర్చొని ఉన్నాడు. అతన్ని ట్రైనీ ఎస్.ఐ ఒకరు గుర్తించి.. ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావంటూ నిలదీశాడు. దీంతో వారిమధ్య వాగ్వాదం జరిగింది. 
 
తను కూడా పోలీసుశాఖలోనే పనిచేస్తున్నానని అనిల్‌కుమార్‌ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆ విషయాన్ని ఎస్ఐ మరో ఇద్దరు ఎస్.ఐల దృష్టికి తీసుకెళ్లాడు. అనిల్‌కుమార్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించుకున్న ఎస్సైలు అతన్ని లాఠీలతో శరీర భాగాలు కుమిలిపోయేలా చితకబాదారు. 
 
ఈ ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ఈ విషయం పోలీస్‌ ఉన్నతాధికారులకు దృష్టికి వెళ్లడంతో... ఎస్పీ అన్బురాజన్‌ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఎస్.ఐల దాడిలో తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్‌ను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments