Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్‌

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (17:16 IST)
కాంగ్రెస్‌ నేత శైలజానాథ్‌ ఏపీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. శైలజానాథ్‌ను ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లుగా మస్తాన్‌ వలీ, తులసిరెడ్డిలను కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది.

ఇంతకాలం ఏపీ పీసీసీ చీఫ్‌గా రఘువీరారెడ్డి ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేతలంతా వీడినా.. రఘువీరా మాత్రం హస్తం పార్టీలోనే కొనసాగారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలవలేదు.
 
ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తులసిరెడ్డి నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఆయన ఉన్నారు. గతంలో 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన తులసిరెడ్డి .. ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు.

రాష్ట్ర విభజన తర్వాత మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాలతో తులసి రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఆయన బీజేపీ, టీడీపీలో కూడా కీలక పదవులు అనుభవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments