Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్‌

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (17:16 IST)
కాంగ్రెస్‌ నేత శైలజానాథ్‌ ఏపీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. శైలజానాథ్‌ను ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లుగా మస్తాన్‌ వలీ, తులసిరెడ్డిలను కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది.

ఇంతకాలం ఏపీ పీసీసీ చీఫ్‌గా రఘువీరారెడ్డి ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేతలంతా వీడినా.. రఘువీరా మాత్రం హస్తం పార్టీలోనే కొనసాగారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలవలేదు.
 
ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తులసిరెడ్డి నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఆయన ఉన్నారు. గతంలో 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన తులసిరెడ్డి .. ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు.

రాష్ట్ర విభజన తర్వాత మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాలతో తులసి రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఆయన బీజేపీ, టీడీపీలో కూడా కీలక పదవులు అనుభవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments