Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక ఎన్నికలు : జేడీఎస్ తరపున పవన్ ప్రచారం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచార బరిలో హేమాహెమీలు ఉన్నారు.

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (09:08 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచార బరిలో హేమాహెమీలు ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు అటు బీజేపీ, జేడీఎస్‌లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న జేడీఎస్ తరపున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి వెల్లడించారు.
 
ఉత్తర కర్ణాటక ప్రాంతం తెలంగాణలోని హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు అనుబంధంగా ఉన్న నేపథ్యంలో పవన్‌తో ఇక్కడ ప్రచారం చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో కనీసం 18 స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే స్టార్‌ క్యాంపెయినర్‌లుగా 'జాగ్వార్‌' హీరో నిఖిల్‌, హీరోయిన్‌ పూజాగాంధీ పేర్లు ప్రకటించామని, వారు ఉత్తర కర్ణాటకలో ప్రచారం చేస్తారని కుమారస్వామి వివరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments