Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు సభలకు నామమాత్రపు బందోబస్తుతో మమ అనిపిస్తున్న పోలీసులు

appolice
Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (11:47 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన చంద్రబాబు నాయుడు నిర్వహించే రోడ్‌షోలకు, బహిరంగ సభలకు ఏపీ పోలీసులు భద్రత కల్పించేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. కేవలం నామమాత్రపు బందోబస్తుతో మమ అనిపిస్తున్నారు. ఈ కారణంగా బుధవారం రాత్రి నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన రోడ్‍షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది చనిపోయారు. దీనికి కారణం సరైన పోలీస్ భద్రత లేకపోవడమేననే విమర్శలు వస్తున్నాయి. ఇది స్థానికంగానే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రభుత్వేతర కార్యక్రమాలకు వస్తే మాత్రం వేలాది మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. అదే చంద్రబాబు పర్యటనలకు మాత్రం పోలీసులు ఏమాత్రం శ్రద్ధ చూపించడంలేదు. నామమాత్రపు భద్రతతో మమ అనిపించేస్తున్నారు. 
 
ఈ నెల 20వ తేదీన ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ విందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హాజరయ్యారు. ఆ రోజు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఈ నెల 26వ తేదీ మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లి మృతి చెందారు. 
 
ఆ తర్వాత రోజు అంటే ఒక్క రోజు వ్యవధిలో జగన్ జిల్లాకు వచ్చారు. కేవలం ఒక్క రోజులోనే వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. చంద్రబాబు పర్యటనలో మాత్రం వేళ్ళమీద లెక్కించే స్థాయిలో పోలీసులతో భద్రత కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments