Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట కర్ఫ్యూను వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (22:21 IST)
రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేసే విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. తొలుత రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయాలని భావించింది. అయితే, రాత్రిపూట కర్ఫ్యూ అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీంతో ఈ నెల 18వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలుకానుంది. ఇటీవల కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సవరణ చేస్తూ తాజాగా మరోమారు జారీచేసింది. 
 
ఇదే అంశంపై రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఆళ్ళ నాని స్పందిస్తూ, సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 
 
రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతి పెరిగినప్పటికీ దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్నిరకాల వైద్య సదుపాయాలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. 
 
అలాగే, కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వం అమలు చేసే ఉల్లంఘించేవారిపట్ల కఠినంగా వ్యవహించాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పారు. ముఖ్యంగా, మాస్కులు ధరించకుంటే రూ.100 అపరాధం విధించాల్సిందిగా ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments