రాత్రిపూట కర్ఫ్యూను వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (22:21 IST)
రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేసే విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. తొలుత రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయాలని భావించింది. అయితే, రాత్రిపూట కర్ఫ్యూ అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీంతో ఈ నెల 18వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలుకానుంది. ఇటీవల కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సవరణ చేస్తూ తాజాగా మరోమారు జారీచేసింది. 
 
ఇదే అంశంపై రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఆళ్ళ నాని స్పందిస్తూ, సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 
 
రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతి పెరిగినప్పటికీ దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్నిరకాల వైద్య సదుపాయాలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. 
 
అలాగే, కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వం అమలు చేసే ఉల్లంఘించేవారిపట్ల కఠినంగా వ్యవహించాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పారు. ముఖ్యంగా, మాస్కులు ధరించకుంటే రూ.100 అపరాధం విధించాల్సిందిగా ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments