Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త టెన్త్ - ఇంటర్ టైం టేబుల్ షెడ్యూల్ వెల్లడి

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (21:48 IST)
జాతీయ స్థాయిలో నిర్వహించే, జేఈఈ ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీల్లో మార్పులు రావడంతో పలు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించిన కొత్త టైం టేబుల్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇపుడు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ కూడా కొత్త టైం టేబుల్‌ను ప్రకటించింది. 
 
తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు టెన్త్ క్లాస్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ బోర్డు, పాఠశాల విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. 
 
పదో తరగతి పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే, ఇంటర్ పరీక్షలకు కూడా కొత్త షెడ్యూల్ ప్రకటించారు. మే 6 నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఇవి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నారు. 
 
కాగా, పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం ప్రకటించిన కొత్త టైం టేబుల్ ప్రకారం ఈ నెల 27వ తేదీన తెలుగు, 28వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 29వ తేదీన ఇంగ్లీష్, మే 2వ తేదీన గణితం మే 4న సైన్స్ పేపర్ 1, మే 5న సైన్స్ పేపర్ 2, మే 6న సోషల్ స్టడీస్ పరీక్షను నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments