Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలి జనార్దన్ రెడ్డిని మించిపోతున్న బాక్సైట్ రెడ్డి!

Webdunia
శనివారం, 10 జులై 2021 (17:12 IST)
బాక్సైట్ రెడ్డి తనకు దేవుడిచ్చిన అన్నయ్య గాలి జనార్దన్ రెడ్డిని మించిపోతున్నాడ‌ని టీడీపీ యువ‌నేత  నారా లోకేశ్ విమ‌ర్శించారు. విశాఖ మన్యం ఏరియాలో లేటరైట్ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతల‌ను పోలీసులు ఎందుకు అడ్డుకున్నార‌ని లోకేష్ ప్ర‌శ్నించారు. విశాఖ మన్యం ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని, వాటిని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు నిర్బంధించారని లోకేశ్ వెల్లడించారు.

పోలీసుల నిర్బంధంలో ఉన్న టీడీపీ నేతలతో తాను ఫోన్లో మాట్లాడానని తెలిపారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అభయారణ్యంలో జగన్ బంధువులు లేటరైట్ ముసుగులో బాక్సెట్ తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇది 15 వేల కోట్ల బాక్సైట్ కుంభకోణం అని పేర్కొన్నారు.

బాక్సైట్ రెడ్డి తనకు దేవుడిచ్చిన అన్నయ్య గాలి జనార్దన్ రెడ్డిని మించిపోతున్నాడని, తన బంధువులైన వైవీ విక్రాంత్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలతో మైనింగ్ మాఫియా పనులు చేయిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేంత వరకు పోరాడాలని టీడీపీ నేతలకు సూచించానని లోకేశ్ వివరించారు.

అభయారణ్యాన్ని ధ్వంసం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తూ, గిరిజనుల హక్కులపై ఉక్కుపాదం మోపుతూ చెలరేగిపోతున్న వైసీపీ మైనింగ్ మాఫియాను తరిమికొట్టేంత వరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments