Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని నాగార్జున ఫామ్‌హౌస్‌లో విషాదం... ఏం జరిగిందంటే...

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఫామ్ హౌస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆయనకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో కరెంట్ షాక్ తగిలి భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే హీరో నాగార

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (14:37 IST)
టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఫామ్ హౌస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆయనకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో కరెంట్ షాక్ తగిలి భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే హీరో నాగార్జున హుటాహుటిన తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.
 
నాగార్జునకు హైదరాబాద్ నగర శివార్లలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ ప్రాంతంలో ఫామ్ హౌస్ ఉంది. ఇందులో వ్యవసాయ పనులను తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు (36), దుర్గ (32) అనే దంపతులు చేస్తున్నారు. 
 
అయితే, ఆదివారం రాత్రి ఇంట్లో కరెంట్ పోవడంతో పొలంలోనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించడానికి వెంకటరాజు వెళ్లాడు. విద్యుత్ ప్రవహిస్తున్న తెగిపడిన వైర్‌ను గమనించక దాన్ని తాకాడు. కరెంట్ షాక్‍తో భర్త విలవిల్లాడుతుంటే, అతన్ని కాపాడేందుకు దుర్గ ప్రయత్నించగా, ఆమెకూ షాక్ తగిలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. 
 
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కూలీల మృతిపై నాగార్జున తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments