Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తోటలోని మామిడి పండ్లు కోశారనీ.. బాలుడిని కాల్చి చంపాడు.. ఎక్కడ?

నేరాలకు ఘోరాలకు అడ్డాగా మారిన బిహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మామిడి పండ్లు కోశాడనీ పదేళ్ల బాలుడుని కాల్చి చంపాడో మానవమృగం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Advertiesment
Bihar
, శుక్రవారం, 22 జూన్ 2018 (11:09 IST)
నేరాలకు ఘోరాలకు అడ్డాగా మారిన బిహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మామిడి పండ్లు కోశాడనీ పదేళ్ల బాలుడుని కాల్చి చంపాడో మానవమృగం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
బీహార్‌లోని ఖగారియా జిల్లా పాత్రాహా గ్రామంలో పిల్లలంతా సమీపంలోని మామిడి తోటలో ఆడుకుంటారు. గురువారం తోటి పిల్లలతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన సత్యం కుమార్... తోటలో మామిడి పండ్లు కోసేందుకు ప్రయత్నించాడు. దీంతో తోట కాపలా కాస్తున్న రామాశీష్ యాదవ్ (43) అనే వ్యక్తి పిల్లాడిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆ పిల్లోడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
దీంతో మిగతా పిల్లలంతా ప్రాణభయంతో పరుగుల తీస్తూ గ్రామంలోకి వచ్చి తోటలో జరిగిన విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత గ్రామస్తులు మామిడి తోటలోకి వెళ్లేలోపే రామాశీష్ పారిపోయాడు. ఈ కిరాతక చర్యపై సత్యం కుమార్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గన్ గురిపెట్టి రికార్డ్ డాన్సర్లపై అత్యాచారం.. ఎక్కడ?