Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుత్తూరు నుంచి తిరుపతి వరకు ఆర్టీసీ బ‌స్సు వేయించిన ఎమ్మెల్యే రోజా

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (15:28 IST)
ఎమ్మెల్యే రోజా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల విన‌తుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించి, ఓట‌ర్ల మెప్పు పొందే ప‌నిలో ఉన్నారు. తాజాగా ఆమె పుత్తూరు నుంచి తిరుపతి వరకు ఆర్టీసీ బ‌స్సు వేయించ‌డ‌మే కాకుండా, దానిని తానే స్వ‌యంగా ప్రారంభించారు. 
 
వడమాలపేట మండలం బుట్టిరెడ్డి కండిగ నుంచి తడుకు వరకు ప్రతి రోజు పాఠశాలల‌కు వెళ్ళే  విద్యార్థినీ విద్యార్థుల అభ్యర్థన మేరకు అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బ‌స్సు మంజూరు చేయించారు.  పుత్తూరు నుంచి తిరుపతి వరకు (వయా తడుకు, బట్టి కండిగ, కుప్పం బాదూరు ) బస్ సర్వీస్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. బట్టికండిగ నుంచి తడుకు వరకు విద్యార్థులతో పాటు బస్ లో ఆర్కే రోజా  ప్రయాణించారు. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్నఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగలరెడ్డి, డిపో మేనేజర్ ప్రశాంతి, స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రోజా కృషిని కొనియాడారు. ఎమ్మెల్యే రోజా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, నాడు నేడు కింద స్కూళ్లను అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పాఠశాలకు రావడానికి విద్యార్థులకు సౌకర్యం కల్పించడం త‌మ‌ భాధ్యత అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments