Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుత్తూరు నుంచి తిరుపతి వరకు ఆర్టీసీ బ‌స్సు వేయించిన ఎమ్మెల్యే రోజా

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (15:28 IST)
ఎమ్మెల్యే రోజా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల విన‌తుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించి, ఓట‌ర్ల మెప్పు పొందే ప‌నిలో ఉన్నారు. తాజాగా ఆమె పుత్తూరు నుంచి తిరుపతి వరకు ఆర్టీసీ బ‌స్సు వేయించ‌డ‌మే కాకుండా, దానిని తానే స్వ‌యంగా ప్రారంభించారు. 
 
వడమాలపేట మండలం బుట్టిరెడ్డి కండిగ నుంచి తడుకు వరకు ప్రతి రోజు పాఠశాలల‌కు వెళ్ళే  విద్యార్థినీ విద్యార్థుల అభ్యర్థన మేరకు అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బ‌స్సు మంజూరు చేయించారు.  పుత్తూరు నుంచి తిరుపతి వరకు (వయా తడుకు, బట్టి కండిగ, కుప్పం బాదూరు ) బస్ సర్వీస్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. బట్టికండిగ నుంచి తడుకు వరకు విద్యార్థులతో పాటు బస్ లో ఆర్కే రోజా  ప్రయాణించారు. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్నఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగలరెడ్డి, డిపో మేనేజర్ ప్రశాంతి, స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రోజా కృషిని కొనియాడారు. ఎమ్మెల్యే రోజా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, నాడు నేడు కింద స్కూళ్లను అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పాఠశాలకు రావడానికి విద్యార్థులకు సౌకర్యం కల్పించడం త‌మ‌ భాధ్యత అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments