Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుత్తూరు నుంచి తిరుపతి వరకు ఆర్టీసీ బ‌స్సు వేయించిన ఎమ్మెల్యే రోజా

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (15:28 IST)
ఎమ్మెల్యే రోజా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల విన‌తుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించి, ఓట‌ర్ల మెప్పు పొందే ప‌నిలో ఉన్నారు. తాజాగా ఆమె పుత్తూరు నుంచి తిరుపతి వరకు ఆర్టీసీ బ‌స్సు వేయించ‌డ‌మే కాకుండా, దానిని తానే స్వ‌యంగా ప్రారంభించారు. 
 
వడమాలపేట మండలం బుట్టిరెడ్డి కండిగ నుంచి తడుకు వరకు ప్రతి రోజు పాఠశాలల‌కు వెళ్ళే  విద్యార్థినీ విద్యార్థుల అభ్యర్థన మేరకు అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బ‌స్సు మంజూరు చేయించారు.  పుత్తూరు నుంచి తిరుపతి వరకు (వయా తడుకు, బట్టి కండిగ, కుప్పం బాదూరు ) బస్ సర్వీస్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. బట్టికండిగ నుంచి తడుకు వరకు విద్యార్థులతో పాటు బస్ లో ఆర్కే రోజా  ప్రయాణించారు. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్నఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగలరెడ్డి, డిపో మేనేజర్ ప్రశాంతి, స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రోజా కృషిని కొనియాడారు. ఎమ్మెల్యే రోజా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, నాడు నేడు కింద స్కూళ్లను అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పాఠశాలకు రావడానికి విద్యార్థులకు సౌకర్యం కల్పించడం త‌మ‌ భాధ్యత అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments