Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడి భార్యపై లైంగిక వేధింపులు.. పురుగుల మందు తాగి..?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:57 IST)
తమ్ముడి భార్యపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కోరిక తీర్చాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామానికి చెందిన జొన్న ఆదిశేషు రెండో కుమారుడు శ్రీనివాసరావుకు, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంకు చెందిన గీతాసురేఖకు 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.
 
శ్రీనివాసరావు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆదిశేషు పెద్ద కుమారుడు శివశంకర్.. శ్రీనివాసరావు భార్యపై కన్నేశాడు. తమ్ముడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అతని భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కోరిక తీర్చాలంటూ పలుమార్లు వేధించాడు.
 
ఈ వేధింపులతో గీతాసురేఖ తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే జనవరి 15న పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇక, మెరుగైన చికిత్స కోసం గీతాసురేఖను విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే అక్కడ చికిత్స పొందుతూ సోమవారం గీతాసురేఖ మృతిచెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం