Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడి భార్యపై లైంగిక వేధింపులు.. పురుగుల మందు తాగి..?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:57 IST)
తమ్ముడి భార్యపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కోరిక తీర్చాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామానికి చెందిన జొన్న ఆదిశేషు రెండో కుమారుడు శ్రీనివాసరావుకు, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంకు చెందిన గీతాసురేఖకు 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.
 
శ్రీనివాసరావు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆదిశేషు పెద్ద కుమారుడు శివశంకర్.. శ్రీనివాసరావు భార్యపై కన్నేశాడు. తమ్ముడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అతని భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కోరిక తీర్చాలంటూ పలుమార్లు వేధించాడు.
 
ఈ వేధింపులతో గీతాసురేఖ తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే జనవరి 15న పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇక, మెరుగైన చికిత్స కోసం గీతాసురేఖను విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే అక్కడ చికిత్స పొందుతూ సోమవారం గీతాసురేఖ మృతిచెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం