Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సంచలనం : డీజీపీ గౌతం సవాంగ్‌పై వేటు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (15:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో కొత్త పోలీస్ బాస్‌గా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. ఈయన ఇంటెలిజెన్స్ డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ బాధ్యతలను ప్రస్తుతం ఈయన వద్దే ఉంచారు. 
 
మరోవైపు, గౌతమ్ సవాంగ్‌ను సాధారణ పరిపలనా శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, గతంలో విజయవాడ, విశాఖపట్టణం పోలీస్ కమిషనర్‌గా పని చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా కూడా విధులు నిర్వహించారు. సీనియారిటీలో ద్వారకా తిరుమలరావు ఉన్నప్పటికీ రాజేంద్రనాథ్ రెడ్డిని పోలీస్ బాస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. 
 
రాజేంద్రనాథ్ రెడ్డి 1992 ఐపీఎస్ కేడర్‌కు చెందిన వ్యక్తి. మరోవైపు, గౌతం సవాంగ్‌కు ఏపీ సర్కారు ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వక పోవడం గమనార్హం. అదేసమయంలో తనకు డీజీపీ పోస్టు ఇవ్వకుండా జూనియర్ అయిన రాజేంద్రనాథ్ రెడ్డికి పోస్టింగ్ ఇవ్వడం పట్ల ద్వారకా తిరుమలరావు కినుకు వహించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments