Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సంచలనం : డీజీపీ గౌతం సవాంగ్‌పై వేటు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (15:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో కొత్త పోలీస్ బాస్‌గా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. ఈయన ఇంటెలిజెన్స్ డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ బాధ్యతలను ప్రస్తుతం ఈయన వద్దే ఉంచారు. 
 
మరోవైపు, గౌతమ్ సవాంగ్‌ను సాధారణ పరిపలనా శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, గతంలో విజయవాడ, విశాఖపట్టణం పోలీస్ కమిషనర్‌గా పని చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా కూడా విధులు నిర్వహించారు. సీనియారిటీలో ద్వారకా తిరుమలరావు ఉన్నప్పటికీ రాజేంద్రనాథ్ రెడ్డిని పోలీస్ బాస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. 
 
రాజేంద్రనాథ్ రెడ్డి 1992 ఐపీఎస్ కేడర్‌కు చెందిన వ్యక్తి. మరోవైపు, గౌతం సవాంగ్‌కు ఏపీ సర్కారు ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వక పోవడం గమనార్హం. అదేసమయంలో తనకు డీజీపీ పోస్టు ఇవ్వకుండా జూనియర్ అయిన రాజేంద్రనాథ్ రెడ్డికి పోస్టింగ్ ఇవ్వడం పట్ల ద్వారకా తిరుమలరావు కినుకు వహించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments