Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏకంగా ముగ్గురిని పెళ్లాడిన వ్యక్తి.. ఒకరి తర్వాత ఒకిరిని పెళ్లాడి..?

Advertiesment
ఏకంగా ముగ్గురిని పెళ్లాడిన వ్యక్తి.. ఒకరి తర్వాత ఒకిరిని పెళ్లాడి..?
, మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (13:41 IST)
పెళ్లి పేరిట మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఏకంగా ముగ్గురిని పెళ్లాడిన ఓ నిత్య పెళ్లికొడుకు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిపై అతడి భార్యలు ఫిర్యాదు చేశారు. మాయమాటలు చెప్పి ఒకరి తర్వాత మరొకర్ని పెళ్ళాడాడని బాధితులు పోలీసులతో వెల్లడించారు. 
 
వివరాల్లోకి వెళితే.. పెద్దతిప్ప సముద్రం మండలంలోని నవాబు కోటకు చెందిన మంజునాథ్ అంగళ్ళ‌కు చెందిన రజినీకి వివాహం అయింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా ఆరేళ్ల కిందట చిక్బల్లాపూర్‌కు చెందిన ఆశ‌ను రెండో వివాహం చేసుకున్నాడు. 
 
అది చాలదన్నట్టుగా బెంగుళూరులో ఓ ప్రైవేటు కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దావణగిరి ప్రియాంకను మూడో వివాహం చేసుకున్నాడు. 
 
తమని మోసం చేశాడంటూ రెండవ భార్య ఆశ ,మూడవ భార్య ప్రియాంకతో కలిసి పిటిఎం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది రజనీ. వీరి ఫిర్యాదుతో మోసగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో దాణా కుంభకోణంలో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్