Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధారాలు అడ‌గ‌డం పోలీస్ వ్య‌వ‌స్థ చేత‌కానిత‌నం: జ‌వ‌హ‌ర్

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (10:02 IST)
దళిత నేత ఆనందబాబుకు నోటీసు ఇవ్వటం పోలీసుల బెదిరింపు చర్యే అని మాజీ మంత్రి, తెలుగుదేశం నాయ‌కుడు జ‌వ‌హ‌ర్ ఆరోపించారు. బెదిరింపులతో దళిత నాయకత్వాన్ని కట్టడి చేయలేర‌ని, అంబేద్కర్ వారసులుగా అక్రమాలను, దౌర్జన్యాలను ఎండగడతాం అన్నారు.
 
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోపణలు చేసిన వారిని ఆధారాలు అడగడం పోలీస్ వ్యవస్థ‌ చేతకానితనానికి  నిదర్శనం అని జ‌వ‌హ‌ర్ విమ‌ర్శించారు. పోలీసులు, దొంగలు ఒక్కటయ్యార‌ని, రాష్ట్రం మాదక ద్రవ్యాల అడ్డాగా మారింద‌ని ఆరోపించారు. పాలకులే అక్రమార్జనకు కేరాప్ అడ్రస్ గా మారార‌ని, నాటు సారా ఏరులై పారుతోంద‌ని, ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయ‌న్నారు. గంజాయి అని టైపు చేస్తే ఏ పి కనపడుతుంద‌ని జ‌వ‌హ‌ర్ పేర్కొన్నారు. 
 
సార రహిత జిల్లాలను నాటు సారా జిల్లాలుగా మార్చార‌ని, ఆబ్కారీ శాఖను ముక్కలు చేసి అక్రమార్జనకు అడ్డు తొలగించార‌ని, ఏ పి ని మాధక ద్రవ్య రాజధాని చేశార‌ని ఆరోపించారు. మీ చేతకానితనం మాకు శాపంగా మారింది... వేధింపులు ఆపకపోతే పరిణామాలకు బాధ్యత పోలీస్ లు వహించాల్సి ఉంటుంద‌ని మాజీ మంత్రి జవహర్ హెచ్చ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments