Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్‌టీపీ ప్ర‌క‌టించి వంద రోజులు... ఇడుపులపాయకు షర్మిల

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (09:52 IST)
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం ఇడుపులపాయకు వ‌స్తున్నారు. వైఎస్సార్‌టీపీని అధికారికంగా ప్రకటించి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 20వ తేదీన చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాద యాత్రకు వైఎస్‌ షర్మిల శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నేడు ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు.

వైఎస్‌ షర్మిలతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా రానున్నారు. మంగళవారం ఉదయం కడప విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు చేరుకుంటారు. తండ్రి సమాధికి నివాళులు అర్పించిన అనంతరం గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. తిరిగి సాయంత్రం ఇడుపులపాయ నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
 
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పార్టీని ప్ర‌క‌టించి వంద రోజులు అయినా, ఇంకా ఆ పార్టీ ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉంది. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌లు, ప్రెస్ మీట్లు... చిన్న చిన్న నిరాహార దీక్ష‌లు మిన‌హా పార్టీలో ఎదుగు బొదుగు లేకుండా ఉంది. ఈ ద‌శ‌లో ష‌ర్మిల చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాద యాత్ర ఎలాంటి ఫ‌లితాల‌ను ఇస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments