Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న 60 మందిపై పోలీసుల కేసు

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (10:15 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా గుంటూరులో టీడీపీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన మోత మోగిద్దాం అనే కార్యక్రమంలో పాల్గొన్న నాయకులపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసారు. అనుమతి లేకపోయినా తప్పెట్లు, కంచాలు మోగిస్తూ విజిల్స్ వేస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ ఎమ్మెల్సీ ఎఎస్ కృష్ణమూర్తి, మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, టీడీపీ నేత మాన శ్రీనివాస రావుతో సహా ఏకంగా 60 మందిపై గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిందరూ విచారణకు హాజరుకావాలని త్వరలోనే నోటీసులు అందజేస్తామని వారు తెలిపారు.
 
మరోవైపు, ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. "విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మంది పై కేసా? పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారిస్తారా? వీళ్ళ తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబుగారి అరెస్టు వార్తలు చూశారని, పసుపు రంగు దుస్తులు వేసుకున్నారనీ, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారు. ఒక పని చేయండి రాజద్రోహం కేసు పెట్టి... ఉరిశిక్ష వేసేయండి. జగన్‌కి పిచ్చి పీక్స్‌లో ఉన్నట్లు ఉంది. కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోడికి సరే... అమలు చేసినోడి బుర్రా బుద్ధీ ఏమయ్యింది?' అంటూ ట్విట్టర్ ఖాతాలో కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments