Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ అలెర్ట్.. మళ్ళీ పెరిగిన గోదావరి..

Webdunia
శనివారం, 23 జులై 2022 (10:35 IST)
గోదావరి నీటి మట్టం మళ్లీ పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మళ్లీ గోదావరి పెరుగుతోంది. 
 
ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 45 అడుగుల వరకు చేరుకుంది. శుక్రవారం ఉదయం 42 అడుగులు వున్న గోదావరి శనివారం తెల్లవారుజామున 45 అడుగులకు చేరుకుంది. 
 
గోదావరి ప్రమాదకరంగా మారడంతో గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు వల్ల మూడవ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. 
 
ఇప్పటికే ఉగ్ర గోదావరి ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో లక్షలాది మందిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని పదుల సంఖ్యల్లోని గ్రామాలు నీట మునిగాయి. 
 
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను నెలకొల్పింది. వరద బాధితులకు ఆర్థిక సాయంతోపాటు రేషన్‌ అందివ్వాలని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించిన సీఎం జగన్‌ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments