Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ అలెర్ట్.. మళ్ళీ పెరిగిన గోదావరి..

Webdunia
శనివారం, 23 జులై 2022 (10:35 IST)
గోదావరి నీటి మట్టం మళ్లీ పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మళ్లీ గోదావరి పెరుగుతోంది. 
 
ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 45 అడుగుల వరకు చేరుకుంది. శుక్రవారం ఉదయం 42 అడుగులు వున్న గోదావరి శనివారం తెల్లవారుజామున 45 అడుగులకు చేరుకుంది. 
 
గోదావరి ప్రమాదకరంగా మారడంతో గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు వల్ల మూడవ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. 
 
ఇప్పటికే ఉగ్ర గోదావరి ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో లక్షలాది మందిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని పదుల సంఖ్యల్లోని గ్రామాలు నీట మునిగాయి. 
 
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను నెలకొల్పింది. వరద బాధితులకు ఆర్థిక సాయంతోపాటు రేషన్‌ అందివ్వాలని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించిన సీఎం జగన్‌ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments