Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదిలోకి పూటుగా మద్యం సేవించి వచ్చిన టీచరమ్మ

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (12:06 IST)
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలే దారితప్పింది. పీకల వరకు మద్యం సేవించి బడికి వచ్చింది. ఆ తర్వాత ఏకంగా తరగతి గదిలోకి వచ్చి పాఠాలు చెప్పింది. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సూరత్‌లోని స్కూల్లో ఓ 38 యేళ్ల మహిళ టీచరుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో జనవరి 31న స్కూలుకు వెళ్లిన ఆమె తప్పతాగి తూలుతూ విద్యార్థుల కంటబడింది.
 
ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఘటనపై విచారణకు సూరత్ మున్సిపల్ ఎడ్యుకేషన్ బోర్డు(ఎస్‌ఎంఈబీ) ఆదేశించినట్లు సమాచారం. మంగళవారం జరిగిన ఎస్‌ఎంఈబీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి సదరు ఉపాధ్యాయురాలు స్కూల్‌కు వెళ్లడంలేదని తెలుస్తోంది. ఈ విషయంలో తమకు ఎటువంటి సమాచారం అందలేదని స్కూలు వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments