Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరుదైన రికార్డ్-రంజీల్లో డబుల్ టన్

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరుదైన రికార్డ్-రంజీల్లో డబుల్ టన్
, మంగళవారం, 28 జనవరి 2020 (19:54 IST)
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదైంది. అలాగే రంజీల్లో డబుల్ సెంచరీ సాధించాడు.. యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అరంగేట్రం మ్యాచ్‌ తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ తీసిన తొలి బౌలర్‌గా మధ్యప్రదేశ్ క్రికెటప్ రవి యాదవ్ చరిత్ర సృష్టించాడు. కెరీర్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న అతను తొలి ఓవర్లోనే హ్యాట్రిక్‌ నమోదు చేయడం విశేషం. 
 
28ఏళ్ల లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ యాదవ్‌ యూపీకి చెందిన వాడు. యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వరుస బంతుల్లో ఆర్యన్‌ జుయాల్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, సమీర్‌ రిజ్వీలను పెవిలియన్‌ పంపాడు. రవి స్పెషల్‌ హ్యాట్రిక్‌ వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  
 
అలాగే రంజీల్లో కూడా కొత్త రికార్డు నమోదైంది. కొద్ది రోజుల క్రితమే రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ క్రికెటర్ సర్ఫరాజ్ 301 పరుగులు చేశాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ అదే దూకుడును రంజీల్లో కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ మంగళవారం వరుసగా రెండో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 
webdunia
 
ముంబై జట్టు తరపున ఆడుతున్న సర్ఫరాజ్ మంగళవారం హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై జట్టును సర్ఫరాజ్ గట్టెక్కించాడు. కేవలం 213 బంతుల్లో 32 ఫోర్లు, 4 సిక్సుల సహాయంతో 226 పరుగులు చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై జట్టు 5 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్‌కు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ వీడ్కోలు