Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేద విద్యార్థులకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్ : నారా భువనేశ్వరి

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (10:37 IST)
రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని ఎన్టీఆర్‌లా సమాజాభివృద్ధికి ఉపయోగపడి గొప్ప నాయకులుగా ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్‌ ఆదర్శ పాఠశాలలో రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ను ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి స్పందిస్తూ, ప్రతిభ గల పేద విద్యార్థులకు, ముఖ్యంగా తల్లిదండ్రులు లేని చిన్నారుల అభివృద్ధికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అండగా ఉంటుందన్నారు. 
 
రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 250 మంది విద్యార్థులు ఆదర్శ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌లో అవకాశాలను సద్వినియోగపర్చుకుని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. కాగా, నారా భువనేశ్వరి ఈ ట్రస్ట్‌కు ఓ ట్రస్టీగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments