Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ వేధింపులు... గ్రామ వలంటీరు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (17:48 IST)
ఓ మహిళ దుర్భాషలాడటంతో భరించలేని ఓ వలంటీరు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లా జీలుగుమిల్లి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జీలుగుమిల్లి మండలం దర్భగూడెం పంచాయతీ పండువారిగూడెంకు చెందిన పండు నవీన(23) ఇటీవల గ్రామ వలంటీరుగా సొంతూరిలోనే విధులు నిర్వహిస్తోంది. 
 
గ్రామానికి చెందిన పూనెం మంగ తన ఆధార్‌ కార్డులో ఇంటి పేరు మార్చాలని కోరారు. శనివారం సదరు మహిళ ఆధార్‌లో పేరు మార్పు విషయంపై నవీనపై దుర్బాషలాడింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నవీన రాసిన సూసైడ్‌ నోట్‌ ద్వారా ఈ విషయాలు తెలిశాయని తండ్రి శ్రీరామ్మూర్తి వాపోయాడు.
 
వలంటీరు నవీనను చూసిన తోటి వలంటీర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం వలంటీర్లకు ముందుగా మానసికంగా సిద్ధపడేలా శిక్షణ ఇచ్చి విధుల్లో చేర్చాల్సిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కొందరు వలంటీర్లు మాత్రం మండల అధికారులు పరిష్కరించాల్సిన సమస్యలు తమపై రుద్దడం దారుణమని వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments