Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. కచ్చులూరు బోటు వెలికితీత ఆపరేషన్ సక్సెస్

Webdunia
మంగళవారం, 22 అక్టోబరు 2019 (14:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు నీటిలో మునిగిపోయి పెను విషాదం నింపింది. అయితే, ఈ బోటును గత కొన్ని రోజులుగా వెలికితీయలేక పోయారు. ఈ నేపథ్యంలో ఈ బోటును వెలికితీసే పనులను ధర్మాడి సత్యం బృందానికి ఏపీ సర్కారు అప్పగించింది. 
 
దీంతో ఈ బోటును వెలికితీసే పనులు గత కొద్ది రోజులుగా చేపట్టిన సత్యం బృందం ఎట్టకేలకు విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తచేసింది. బోటును సత్యం టీమ్ నీళ్లపైకి తెచ్చింది. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో వెలికితీశారు. 
 
ఇంకొద్దిసేపట్లో బోటును ధర్మాడి సత్యం ఒడ్డుకు తీసుకురానున్నారు. అయితే వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా సెప్టెంబర్ 15వ తేదీ కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగి 25 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments