Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆదిని ఆప‌రేషన్ గోల్డ్ ఫిష్ అయినా ఆదుకుంటుందా..?

ఆదిని ఆప‌రేషన్ గోల్డ్ ఫిష్ అయినా ఆదుకుంటుందా..?
, శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (14:42 IST)
ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్). సెన్సిబుల్ సినిమాలు వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింతతో విజయాలు అందుకున్న సాయికిరణ్ అడివి, ఈసారి కాశ్మీర్ పండిట్ల సమస్యలను వెండితెర పై ఆవిష్కరించడానికి సిద్ధమయ్యారు. 
 
తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. అక్టోబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా సాయికిరణ్ అడివి మాట్లాడుతూ..."వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా క‌ల్పిత కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్, ఘాజీ బాబా పాత్రలో అబ్బూరి రవి, ఫరూఖ్ ఇక్బాల్ ఇరాఖీగా మనోజ్ నందం, ఇంకా శ‌షా చెట్రి, కృష్ణుడు, నిత్యా నరేష్, పార్వతీశం, కార్తీక్ రాజు అద్భుతంగా నటించారు. 
 
ప్రచార చిత్రాలకు అద్భుత స్పందన లభిస్తోంది. శ్రీచరణ్ పాకాల చక్కటి స్వరాలను, నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాలో దేశభక్తి గీతాన్ని పాడిన కీరవాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ పాటకు రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. సినిమాపై ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను తప్పకుండా చేరుకుంటామన్న నమ్మకం ఉంది. సెన్సార్ సభ్యులు సినిమా బావుందని మెచ్చుకున్నారు. అక్టోబర్ 18న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు.
 
ఇక ఆది సాయికుమార్ అయితే... తొలిసారి ఎన్.ఎస్.జి కమాండోగా నటించాను.  లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సాయికిరణ్ అడివి గారు కథ పై ఎంతో పరిశోధన చేసి సినిమా తీశారు. కశ్మీర్ పండిట్ల జీవితాలను, అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చుతుంది అంటూ సినిమా విజ‌యం పై త‌న‌కున్న న‌మ్మ‌కాన్ని తెలిచేసాడు.  ఇటీవ‌ల కాలంలో ఆది సాయికుమార్ న‌టించిన ఏ సినిమా స‌క్స‌స్ కాలేదు. మ‌రి... ఈ సినిమా అయినా ఆదిని ఆదుకుంటుందో లేదో..?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న‌య‌న్-విఘ్నేష్ మ్యారేజ్. ఇంత‌కీ ఎప్పుడు..?