Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ సుధాకర్‌కు వైద్యం చేయనున్న మహిళా వైద్యురాలు!

Webdunia
ఆదివారం, 31 మే 2020 (12:04 IST)
విశాఖపట్టణంలోని మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్‌కు చికిత్స చేస్తున్న వైద్యుడిని మార్చివేశారు. ఆయన స్థానంలో ఓ మహిళా వైద్యురాలిని నియమించారు. ఆమె పేరు మాధవీలత. 
 
తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడి విషయంలో డాక్టర్ సుధాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన స్థానంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి పర్యవేక్షణలో డాక్టర్ మాధవీలత ఆయనకు వైద్యసేవలు అందించనున్నట్టు అధికారులు తెలిపారు.
 
కాగా, అంతకుముందు డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయి మాట్లాడుతూ తన కుమారుడిపై స్లో పాయిజన్ ప్రయోగం జరుగుతోందని చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తమ కుమారుడిపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులు, తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
 
రంగంలోకి దిగిన సీబీఐ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. డాక్టర్ సుధాకర్ పట్ల దాడికి పాల్పడిన పోలీసులపై కేసులు నమోదు చేసి విచారించాలని సీబీఐని ఆదేశించింది.
 
ఈ నేపథ్యంలో సీబీఐ శనివారం రంగంలోకి దిగింది. సుధాకర్‌ను ఉంచిన మానసిక చికిత్సాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు దాదాపు 5 గంటలసేపు ఆయన నుంచి పూర్తి వివరాలను తీసుకున్నారు. మాస్కులు ఇవ్వలేదంటూ గొడవ చేసిన రోజు నుంచి జరిగిన అన్ని పరిణామాలపై సమాచారాన్ని సేకరించారు.
 
మరోవైపు హైకోర్టు ఆదేశాలతో కేసును విచారించిన సీబీఐ... పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఐపీసీ 120బి, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కావాలని దూషించడం, నేరపూరిత కుట్ర, దొంగతనం, బెదిరింపులకు పాల్పడటం, అక్రమ నిర్బంధం వంటి అభియోగాలను నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments