Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 8380 కేసులు

Webdunia
ఆదివారం, 31 మే 2020 (11:52 IST)
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో మరో 8380 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో 193 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,82,143కి చేరగా, మృతుల సంఖ్య 5,164కి చేరుకుంది. 89,995 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,984 మంది కోలుకున్నారు.
 
21 మంది కోలుకుంటున్నారు : లారెన్స్ 
అనాథ చిన్నారుల కోసం తాను నిర్వహిస్తున్న ట్రస్టులోని 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బంది కరోనా బారినపడిన మాట వాస్తవమేనని ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ తెలిపారు. అయితే, ప్రస్తుతం వాళ్లంతా కోలుకుంటున్నారని చెప్పారు. 
 
చెన్నై అశోక్ నగరంలోని లారెన్స్ ట్రస్టులో వారం రోజుల క్రితం ట్రస్టులోని కొందరు చిన్నారుల్లో జ్వరంతోపాటు కోవిడ్-19 లక్షణాలు కనిపించడంతో వారికి వెంటనే పరీక్షలు చేయించినట్టు తెలిపారు. ఈ పరీక్షల్లో 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు.
 
కరోనా బారినపడిన ముగ్గురు సిబ్బందిలో ఇద్దరు దివ్యాంగులు ఉన్నారని వివరించారు. వైరస్ బారినుంచి వారు త్వరగానే కోలుకుంటున్నారని, సమాచారం అందుకున్న వెంటనే చర్యలు తీసుకున్న ఎస్పీ వేలుమణికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు రాఘవ లారెన్స్ తెలిపారు. చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు దేవుడ్ని ప్రార్థించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments