Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 8380 కేసులు

Webdunia
ఆదివారం, 31 మే 2020 (11:52 IST)
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో మరో 8380 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో 193 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,82,143కి చేరగా, మృతుల సంఖ్య 5,164కి చేరుకుంది. 89,995 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,984 మంది కోలుకున్నారు.
 
21 మంది కోలుకుంటున్నారు : లారెన్స్ 
అనాథ చిన్నారుల కోసం తాను నిర్వహిస్తున్న ట్రస్టులోని 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బంది కరోనా బారినపడిన మాట వాస్తవమేనని ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ తెలిపారు. అయితే, ప్రస్తుతం వాళ్లంతా కోలుకుంటున్నారని చెప్పారు. 
 
చెన్నై అశోక్ నగరంలోని లారెన్స్ ట్రస్టులో వారం రోజుల క్రితం ట్రస్టులోని కొందరు చిన్నారుల్లో జ్వరంతోపాటు కోవిడ్-19 లక్షణాలు కనిపించడంతో వారికి వెంటనే పరీక్షలు చేయించినట్టు తెలిపారు. ఈ పరీక్షల్లో 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు.
 
కరోనా బారినపడిన ముగ్గురు సిబ్బందిలో ఇద్దరు దివ్యాంగులు ఉన్నారని వివరించారు. వైరస్ బారినుంచి వారు త్వరగానే కోలుకుంటున్నారని, సమాచారం అందుకున్న వెంటనే చర్యలు తీసుకున్న ఎస్పీ వేలుమణికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు రాఘవ లారెన్స్ తెలిపారు. చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు దేవుడ్ని ప్రార్థించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

Akshaye Khanna: ప్రశాంత్ వర్మ.. మహాకాళి నుంచి శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

భారతదేశంలో వైభవోపేతంగా అడుగుపెట్టిన హెచ్ అండ్ ఎం బ్యూటీ కాన్సెప్ట్

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

తర్వాతి కథనం
Show comments