Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డాక్టర్ సుధాకర్ కేసు : సీబీఐ విచారణపై సుప్రీంను ఆశ్రయించనున్న ఏపీ సర్కారు

డాక్టర్ సుధాకర్ కేసు : సీబీఐ విచారణపై సుప్రీంను ఆశ్రయించనున్న ఏపీ సర్కారు
, మంగళవారం, 26 మే 2020 (16:24 IST)
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సుధాకర్‌పై విశాఖ పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహాన్ని నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. 
 
డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖపట్టణం పోలీసులు హేయమైన రీతిలో ప్రవర్తించిన విషయం తెల్సిందే. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించింది. 
 
డాక్టర్ సుధాకర్‌పై జరిగిన పోలీసు దాడిని హైకోర్టు తీవ్రంగా తీసుకుంది. దాడికి పాల్పడిన పోలీసులపై కేసులు నమోదు చేసి, ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
 
ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో సుధాకర్ ఒంటిపై గాయాలు లేవని ఉందని... తాజాగా మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో సుధాకర్ శరీరంపై గాయలున్నాయని ఉందని... అందుకే దీని వెనుక కుట్ర ఉన్నట్టు హైకోర్టు భావించింది. 
 
అనుమానాలు ఉన్నందువల్లే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పును సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయనుంది. ఈ అంశానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిటిడిని బిజెపి రాజకీయంగా వాడుకుంటుందా?