Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం.. 12 రైళ్లు తాత్కాలికంగా రద్దు

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (14:58 IST)
విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ బీబీనగర్ వద్ద బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. మొత్తం నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. 12 రైళ్ళను తాత్కాలికంగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను వేరే మార్గాల్లో దారి మళ్లించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
ఇదిలావుంటే, ప్రమాదం కారణంగా పట్టాలు తప్పిన బోగీలను అక్కడే వదిలేసి మిగితా బోగీలతో రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. బోగీలు నిలిచిపోయిన కారణంగా ఆ మార్గం మీదుగా ప్రయాణించాల్సిన ఏడు రైళ్లను రద్దు చేశారు. మరో 12 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దక్షిణ రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ఈ ప్రమాదం కారణంగా రద్దు చేసిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, కాచిగూడ - నడికుడి, నడికుడి - కాచిగూడ, సికింద్రాబాద్ - వరంగల్, వరంగల్ - హైదరాబాద్, గుంటూరు - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - రేపల్లే రైళ్లు రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments