Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకానందరెడ్డి హత్యపై భరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (10:29 IST)
ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై కడప జిల్లా పులివెందులలో గోర్ల భరత్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్యకు ప్రత్యేక సూత్రధారుడు అల్లుడు నరరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని షాకింగ్ కామెంట్లు చేశారు. కేవలం ఆస్తి కోసమే వైఎస్ వివేకా హత్య జరిగిందని, సునీల్ యాదవ్ నేరుగా తనతోనే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించినట్టు భరత్ యాదవ్ పేర్కొన్నారు.
 
 
వివేకా సన్నిహితురాలు షమీంకు ఆస్తి చేరిపోతుందనే ఉద్దేశంతోనే వివేకా హత్య జరిగినట్లు తెలిపారు. హత్యకు వెల్లడించక పోవడానికి గల కారణం కేవలం ప్రాణభయం మాత్రమేనని అని.. మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలపై తనకు తెలిసిన విషయాలను మీడియాతో ఇవాళ చెప్పాల్సి వచ్చిందన్నారు. అయితే హత్యకు గల కారణాలను మొట్టమొదటగా సీబీఐకి అందించిన వ్యక్తి నేనేనని గోర్ల భరత్ యాదవ్ వెల్లడించారు.
 
కాగా  వివేకానందరెడ్డి 2019 మార్చి 14న అర్ధరాత్రి తన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసు అనుమానితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులుగా ఉన్న పలువురు ఆయన హత్యపై కీలక విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments