Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగం బ్యారేజీ నిర్మాణ పనులు త్వరలో పూర్తి : మంత్రి మేకపాటి

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (11:26 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన సంగం బ్యారేజి నిర్మాణం పనులు గత ప్రభుత్వం శీతకన్ను వేసిందని, అతి త్వరలో నిర్మాణ పనులు పూర్తిచేసి సాగు తాగు నీరు అందిస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. 
 
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డిలతో కలిసి సంగం బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రులు గౌతం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లు గురువారం పరిశీలించారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ బ్యారేజీ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తిచేయడమే కాకుండా, పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సంగం, నెల్లూరు బ్యారేజీ నిర్మాణ పనులను సెప్టెంబరు అక్టోబరు లోపల పూర్తి చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే సోమశిల హైలెవల్ కెనాల్ ఫేస్ 1, ఫేస్ 2 పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బ్యారేజి నిర్మాణ పనులకు నిధులు సక్రమంగా కేటాయించనందున నిర్మాణం నత్తనడకన సాగిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే  నిర్మాణ ప్రక్రియ వేగవంతం అయిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments