అయ్యో పాపం ఐఎఎస్‌ అధికారులు..!!

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (11:06 IST)
అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలలో ఐఎఎస్‌ అధికారులకు 500 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేవలం రూ.25 లక్షలకే ఇచ్చిన విషయం విధితమే. ప్రస్తుత ఐఎఎస్‌ అధికారులతో పాటు ఒకటి రెండు సంవత్సరాలు ముందు రిటైర్డు అయిన ఐఎఎస్‌ అధికారులకు కూడా ప్రభుత్వం స్థలం ఇవ్వటం జరిగింది.
 
ఈ అధికారులలో చాలా మంది బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. కానీ ఇంత వరకు ఎవరెవరికి ఎక్కడెక్కడ స్థలం ఇచ్చారో చూపించలేదు. అంటే ఇంకా వారి ప్లాట్లను అభివృద్ది చేయలేదు అసెంబ్లీ ఆఖరి రోజు ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ప్రకటనతో 500గజాల స్థలాలను కొనుగోలు చేసిన ఐఎఎస్‌ అధికారులు ఖంగుతిన్నారు. డీలా పడ్డారు. పరిపాలనకు సంబంధించిన రాజధాని ఇక్కడ లేనప్పుడు 500 గజాలలో ఇళ్లు ఎలా ఎట్టుకోవాలి. ఉద్యోగాలు చేసేది విశాఖపట్నంలో.. అమరావతిలో ఇల్లు కట్టుకుని ఏం చేయాలి.
 
ఈ విషయంపై ఐఎఎస్‌ అధికారుల సంఘం త్వరలో సమావేశం కావచ్చు. మేము 25 లక్షల రూపాయలు చెల్లించాం. మాకు ఆ స్థలాలు అక్కర్లేదు. వడ్డీతో కానీ లేక వడ్డీ లేకుండా కానీ మా రూ.25 లక్షలు తిరిగి చెల్లించండి అని కోరే అవకాశం ఉండవచ్చు. ఆ విధంగా ఐఎఎస్‌ అధికారులు కోరితే జగన్‌ కూడా అంగీకరించవచ్చు.

రాజధాని అమరావతి ప్రాంతంలో 500గజాలు 25లక్షలకు వచ్చింది… అక్కడే ఇల్లు నిర్మించుకుని స్థిర పడవచ్చు అని ఆశపడ్డ అనేక మంది ఐఎఎస్‌ అధికారులకు శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వారిని నిరాశపరిచిందని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments