Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా నయం లోకేశ్‌ను మంత్రిపదవిలో కొనసాగించాలని కోరలేదు : మంత్రి బొత్స

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (14:09 IST)
ఏపీ శాసనసభ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య వాదోపవాదాలు తారా స్థాయిలో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా, మంగళవారం ఏపీ శాసనమండలిలో వృద్ధాప్య పింఛన్లపై చర్చ జరిగింది. ఇందులో టీడీపీ ఎమ్మెల్సీ గౌరినేని శ్రీనివాస రావు పాల్గొని మాట్లాడుతూ, వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.3 వేలు పింఛన్ ఇస్తానని సీఎం జగన్ ఎన్నికలకు ముందు ప్రకటన చేశారనీ, ఎన్నికలు ముగిసి అధికారంలోకి రాగానే తన హామీని విస్మరించి మోసం చేశారని ఆరోపించారు. 
 
దీనికి మంత్రి బొత్స సత్యనారాయణ ధీటుగా సమాధానమిచ్చారు. వితంతువులు, వృద్ధులకు ఏకంగా రూ.3 వేలు చొప్పున పింఛన్లు ఇస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు. అదేసమయంలో వృద్ధులు, వితంతువులకు యేడాదికి రూ.250 చొప్పున పెంచుతూ వచ్చే ఐదేళ్ళలో ఈ పింఛనను రూ.3 వేలకు పెంచుతామని ఆయన వెల్లడించారు. 
 
అంతేకాకుండా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గతంలో కూడా టీడీపీ కూడా అలానే చేసిందన్నారు. ఈ విషయం టీడీపీ నేతలకు బాగా తెలుసన్నారు. ఇపుడు కూడా తమ ప్రభుత్వం అదే పని చేస్తుందన్నారు. 
 
ఇంకా నయం... రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైనా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ను మంత్రిపదవిలో కొనసాగించాలని అనలేదు అని మంత్రి బొత్స చలోక్తి విసిరారు. బొత్స వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ సభ్యులు శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments