Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేమిచ్చే తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టుకెళ్లండి... హైకోర్టు సీరియస్

మేమిచ్చే తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టుకెళ్లండి... హైకోర్టు సీరియస్
Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (15:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంపై ఏపీ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చే తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టు వెళ్లాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 
 
ఏపీలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ పార్టీ నేతలు అధికార బలంతో హైకోర్టు ఇచ్చే తీర్పులను తూర్పారబడుతూ, విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. 
 
అదేసమయంలో కోర్టు తీర్పులపై వైకాపా నేతల విమర్శలను ఆక్షేపణ చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు... న్యాయ వ్యవస్థను ఉద్దేశించి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికింది.
 
హైకోర్టు వెలువరించిన తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని... బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవని అసహనం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments