Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేమిచ్చే తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టుకెళ్లండి... హైకోర్టు సీరియస్

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (15:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంపై ఏపీ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చే తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టు వెళ్లాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 
 
ఏపీలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ పార్టీ నేతలు అధికార బలంతో హైకోర్టు ఇచ్చే తీర్పులను తూర్పారబడుతూ, విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. 
 
అదేసమయంలో కోర్టు తీర్పులపై వైకాపా నేతల విమర్శలను ఆక్షేపణ చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు... న్యాయ వ్యవస్థను ఉద్దేశించి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికింది.
 
హైకోర్టు వెలువరించిన తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని... బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవని అసహనం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments