Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో విద్యా కానుక ప్రారంభం.. సీఎం జగన్ భుజానికి స్కూలు బ్యాగు

ఏపీలో విద్యా కానుక ప్రారంభం.. సీఎం జగన్ భుజానికి స్కూలు బ్యాగు
, గురువారం, 8 అక్టోబరు 2020 (15:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసింది. జగనన్న విద్యా కానుక పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 
 
ఈ పథకం కింద రాష్ట్రంలోని 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పేరిట కిట్ బ్యాగులు అందిస్తారు. కృష్ణా జిల్లా పునాదిపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సీఎం జగన్ ఈ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
 
ఈ సందర్భంగా ఓ కిట్ బ్యాగును స్వయంగా భుజానికి తగిలించుకున్న ఆయన చిరునవ్వులు చిందించారు. జగన్ ఎంతో ఉల్లాసంగా ఉండడాన్ని గమనించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు కూడా నవ్వేయడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
 
ఈ విద్యాకానుకలో భాగంగా ఓ స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్ ఉంటాయి. యూనిఫాం కుట్టుకూలి కూడా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. జగనన్న విద్యాకానుక కోసం సర్కారు రూ.650 కోట్లు ఖర్చు చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమలా హారిస్ - మైక్ పెన్స్ మధ్య హోరాహోరీగా డిబేట్: సంవాదంలో గెలుపెవరిది?