Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విద్యా కానుక ప్రారంభం.. సీఎం జగన్ భుజానికి స్కూలు బ్యాగు

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (15:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసింది. జగనన్న విద్యా కానుక పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 
 
ఈ పథకం కింద రాష్ట్రంలోని 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పేరిట కిట్ బ్యాగులు అందిస్తారు. కృష్ణా జిల్లా పునాదిపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సీఎం జగన్ ఈ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
 
ఈ సందర్భంగా ఓ కిట్ బ్యాగును స్వయంగా భుజానికి తగిలించుకున్న ఆయన చిరునవ్వులు చిందించారు. జగన్ ఎంతో ఉల్లాసంగా ఉండడాన్ని గమనించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు కూడా నవ్వేయడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
 
ఈ విద్యాకానుకలో భాగంగా ఓ స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్ ఉంటాయి. యూనిఫాం కుట్టుకూలి కూడా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. జగనన్న విద్యాకానుక కోసం సర్కారు రూ.650 కోట్లు ఖర్చు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments