సిద్ధమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త జట్టు

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (13:22 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరికొత్త జట్టు సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీన ఈ కొత్త జట్టు కోసం ఎంపికైన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో గవర్నర్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కొత్త జట్టును పాత, కొత్త కలయికతో తన టీమ్ ఎంపిక చేసుకున్నారు. పాతవారిలో 10 మందికి మళ్లీ మంత్రులుగా అవకాశం కల్పించారు. కొత్తగా 15 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. 
 
కొత్త మంత్రుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత దక్కబోతుంది. బలహీనవర్గాలకు పెద్ద పీట వేసి వారిని రాజ్యాధికారంలో మరిత కీలక భాగస్వాములను చేయాలనే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అందులోభాగంగానే 56 శాతం మంత్రిపోస్టులను వారికే కేటాయించినట్టు తెలుస్తుంది. 
 
అదేసమయంలో ఇప్పటివరకు మంత్రివర్గంలో ఉన్న 10 మంది వరకు ఆయా జిల్లాల అవసరాలు, సామాజిక మార్పు, అనుభవం ఆధారంగా ఇకపైనా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఇప్పటివరకు అగ్రవర్ణాలకు చెందిన 44 శాతం మంది ఉండగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే మెజార్టీ సంఖ్యలో 56 శాతంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments