Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ త్వరలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రకటన

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (12:33 IST)
ఇంటర్‌లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు త్వరలో ప్రకటన వెలువడనుంది. ఈ ఏడాది మొదటిసారిగా ప్రవేశాలను ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలను ఇంటి నుంచే ఎంపిక చేసుకోవచ్చు.

ఒక్కొక్కరు ఎన్ని కళాశాలలకైనా ఐచ్ఛికాలను ఇచ్చుకోవచ్చు. ఈసారి ప్రవేశాల్లో ప్రైవేట్‌ సహా అన్ని జూనియర్‌ కళాశాలల్లోనూ రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో కళాశాలలను ఎంచుకునే సమయంలోనే వాటిలో ఉండే మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల వివరాలు కనిపిస్తాయి.

విద్యార్థులు కేవలం తమ వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది. ఎన్‌సీసీ కోటా వారు మాత్రమే ధ్రువపత్రాలను స్కానింగ్‌ చేసి, జతపరచాలి. గతేడాది రుసుములతోనే ప్రవేశాలు నిర్వహించాలని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

నిరుడు ప్రైవేటు కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.3,119, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.3,432లను రుసుములుగా నిర్ణయించింది. కొత్త బోధన రుసుములను నిర్ణయించే వరకు ఈ మొత్తాన్నే వసూలు చేయాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments